Asianet News TeluguAsianet News Telugu

ప్ర‌లోబాలు పెట్టిన టీడీపీకి వ్య‌తిరేకంగా ఓటు వేశారు

  • టీడీపీ నాయ‌కులు ప్ర‌జ‌ల‌ను ఎన్నో ర‌కాలుగా ప్ర‌లోబాలు పెట్టారు.
  • వైసీపి తప్పకుండా విజయం సాధిస్తుంది.
  • భారీ మోజార్టీతో విజయం ఖాయం.
we will win in nadyla by poll says silpa mohan reddy

పోలింగ్ ప్రారంభ ద‌శ‌ నుండి టీడీపీ నాయ‌కులు ప్ర‌జ‌ల‌ను ఎన్నో ర‌కాలుగా ప్ర‌లోబాలు పెట్టారని ఆరోపించారు వైసీపి పార్టి అభ్య‌ర్ధి శిల్పా మోహాన్ రెడ్డి, గంట‌ల పాటు బారులు తీరీ మ‌రీ ప్ర‌జలు ఓట్లు వేశారని, అందుకు కార‌ణం ప్ర‌భుత్వ వ్య‌తిరేకతే అని ఆయ‌న విమ‌ర్శించారు. ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన త‌రువాత శిల్పా సోధ‌రులు మీడియాతో మాట్లాడారు.

నిన్న సాయంత్రం నుండి టీడీపీ నేత‌లు పోలీంగ్ కు విఘాతం క‌ల్గించడానికి ప్ర‌య‌త్నించారని ఆరోపించారు శిల్పా మోహాన్ రెడ్డి. త‌న సోద‌రుడు చ‌క్ర‌పాణి రెడ్డిని అరెస్టుకు తీవ్ర ప్ర‌త్నాలు చేశార‌ని ఆయ‌న పెర్కొన్నారు. రాజ్యాంగాన్ని గౌవ‌ర‌వించి త‌మ‌ త‌మ్ముడిని తానే స్వ‌యంగా భ‌య‌టికి  పంపించాన‌ని తెలిపారు.

మౌనిక రెడ్డి  వైసీపి నేత‌ల‌ను భ‌య‌పెట్టార‌ని.. ఆఫీస‌ర్లు చెయ్యాల్సిన ప‌నులు మౌనిక చేశారని ఆరోపించారు. అదేవిధంగా ఏఈ సుబ్బారెడ్డి త‌మ్ముడు త‌మ నేత‌ల‌ను పోలింగ్ స‌మ‌యంలో కొట్టించారని ఆయ‌న ఆవేధ‌న వ్య‌క్తం చేశారు. భూమా బ్ర‌హ్మానంద‌ రెడ్డి కూడా త‌మ‌ని బెదిరించారని ఆరోపించారు, టీడీపీ నేత‌లు నాలుగు వాహానాల‌తో పోలింగ్ స‌ర‌ళీని ప‌రీశీలీస్తుంటే, త‌మ‌కు మాత్రం ఒక్క‌టే వాహానానికి అనుమ‌తి ఇచ్చార‌ని ఆయ‌న వాపోయారు. నిబంధ‌న‌ల‌ను పాటించాల్సిన‌ పోలీసులు టీడీపీకి నేత‌ల‌కు స‌పోర్టు చేశారని ఆయ‌న ఆరోపించారు.


నంద్యాల్లో ఓట‌ర్ల‌ను చివ‌రి వ‌ర‌కు టీడీపీ నేత‌లు భ‌య‌బ్రాంతుల‌కు గురి చేశారని శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి ఆరోపించారు. త‌మ పైన నింద‌లు వేస్తూ ప్ర‌చారం చేశార‌ని చివ‌ర‌కు టీడీపీకి ఓట‌మీ త‌ప్ప‌ద‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో వైసీపి భారీ మెజార్టీతో విజ‌యం సాధిస్తుంద‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు.  

 

 

మరిన్ని తాజా విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

 

Follow Us:
Download App:
  • android
  • ios