విశాఖలో 28 ఏళ్ల యువతికి కరోనా పాజిటివ్ తేలింది. దీంతో అప్రమత్తమైన వైద్యులు, అధికారులు అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
విశాఖలో యువతికి కరోనా కేసు..భయం లేదంటున్న అధికారులు!
దేశాన్ని విడిచి వెళ్లిపోయింది అనుకున్న కరోనా..చాలా గ్యాప్ తరువాత మరోసారి నేను ఎక్కడికి పోలేదు అంటూ పలకరించడానికి రెడీ అయిపోయింది. తాజాగా విశాఖపట్నంలోని ఓ యువతికి కరోనా పాజిటివ్ రావడంతో వారం రోజుల పాటు వైద్యులు ఐసోలేషన్ లో ఉంచారు. కరోనా పాజిటివ్ రావడంతో ప్రభుత్వం మరోసారి అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ విధిగా మాస్కులు ధరించాలని సూచించింది. అలాగే గుంపులు, గుంపులుగా తిరగవద్దంటూ ప్రజలకు సూచనలు చేసింది. కరోనా మహమ్మారి మళ్లీ దేశ వ్యాప్తంగా వ్యాపిస్తోంది.
ఇప్పుడు ఇది ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చేసింది. తాజాగా ఏపీలో తొలి కేసు విశాఖపట్నంలో నమోదైంది. 28 ఏళ్ల మహిళకు పాజిటివ్గా నిర్ధారణ అయింది, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు మాస్క్లు ధరించాలని, కొవిడ్ లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రజలు గుంపులుగా ఉండొద్దని, సభలు , సమావేశాలు, పార్టీలు, వంటి సామూహిక సమావేశాల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులో మరోసారి టెన్షన్ పెడుతున్నాయి.సింగపూర్, హాంగ్కాంగ్, చైనాతో పాటుగా మరికొన్ని దేశాల్లో కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. భారత్లో కూడా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. అయితే తెలుగు రాష్ట్రాలను కూడా కరోనా టెన్షన్ రోజురోజుకి పెరుగుతుంది. ఈ క్రమంలో ఏపీలో తొలి కరోనా కేసు నమోదైంది. విశాఖపట్నంలోని మద్దిలపాలెంలో 28 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్గా తేలింది. మొదట ఈ జ్వరాన్ని మలేరియా డెంగ్యూ అని భావించి నాలుగు రోజుల క్రితం వైద్య పరీక్షలు చేశారు. ఈ క్రమంలోనే ఆ శాంపిల్ను కేజీహెచ్లోని వైరాలజీ ల్యాబ్లో కూడా పరీక్షలు చేశారు.
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయగా…
అక్కడ కూడా కరోనా పాజిటివ్ అని తెలిసింది.ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయగా.. ముందస్తు జాగ్రత్తగా వారం రోజుల పాటు హోమ్ ఐసోలేషన్లో ఉండాలని డాక్టర్లు సూచించారు. ఆమెతోపాటు కుటుంబసభ్యులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. కోవిడ్ పాజిటివ్ కేస్ వచ్చిన చుట్టుపక్కల ప్రాంతాల్లో మూడు టీమ్లతో ఇంటింటికీ సర్వే నిర్వహించారు. ముందస్తు జాగ్రత్తగా ఆ ఇంటి చుట్టుపక్కల వారందరికీ నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. 70 ఇళ్ల పరిధిలోని 200 మందికి సంబంధించిన ఆరోగ్య వివరాలు సేకరించారు.
అయితే పాజిటివ్ తేలిని మహిళ ఎక్కడికీ ప్రయాణాలు చేయలేదుని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ముందు జాగ్రత్తగా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులు వైద్యులకు సూచించారు. కరోనా నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అప్రమత్తంగా ఉంటే చాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వివరించారు. బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు మాస్క్ ధరించాలని చెబుతున్నారు. అలాగే బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ముందస్తు జాగ్రత్తగా మాస్క్లు ధరించాలని అంటున్నారు.
కరోనా టెన్షన్ వెంటాడుతున్న వేళ వైద్య, ఆరోగ్య శాఖ ప్రజలకు కొన్ని సూచనలు చెప్పింది. కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి లక్షణాలు ఉంటే ఇంట్లో విడిగా ఉండాలని సూచించారు. డాక్టర్ల సలహా మేరకు మందులు వాడాలన్నారు. ప్రయాణాల్లో, జనసమూహాల్లో మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. కొవిడ్ కేసుల ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చినవారు అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు.