Asianet News TeluguAsianet News Telugu

ఇసుక అక్రమ రవాణా, అడ్డుకున్న అధికారులను చితకబాదిన గ్రామస్తులు

ఏపీలో ఇసుక మాఫీయా రెచ్చిపోతోంది. ఏకంగా ప్రభుత్వోద్యోగులపైనే దాడులకు దిగింది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం గ్రామీణ మండలం నైరలో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో రెవెన్యూ సిబ్బంది మంగళవారం రాత్రి నైర బీసీ కాలనీకి చేరుకున్నారు.

villagers attack on revenue staff in srikakulam
Author
Srikakulam, First Published May 15, 2019, 8:00 AM IST

ఏపీలో ఇసుక మాఫీయా రెచ్చిపోతోంది. ఏకంగా ప్రభుత్వోద్యోగులపైనే దాడులకు దిగింది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం గ్రామీణ మండలం నైరలో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో రెవెన్యూ సిబ్బంది మంగళవారం రాత్రి నైర బీసీ కాలనీకి చేరుకున్నారు.

లారీల్లో అక్రమంగా తరలిస్తున్న ఇసుకను అధికారులు అడ్డుకున్నారు. దీంతో నైర గ్రామస్తులు వారిపై కర్రలతో దాడికి దిగారు. ఈ ఘటనలో వీఆర్వోలు చంద్రశేఖర్, విశ్వేశ్వరరావుకు గాయాలయ్యాయి.

మిగిలిన ముగ్గురు వీఆర్వోలు దాడి నుంచి తప్పించుకున్నారు. గాయపడిన వారిని శ్రీకాకుళం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios