దారుణం: పని ఇప్పిస్తామని వ్యభిచార గృహనికి యువతి విక్రయం
ఏడాదిగా వ్యభిచార కూపంలోనే
విజయవాడ: విజయవాడలో ఓ యువతిని నమ్మించి వ్యభిచార కూపంలోకి నెట్టాడు ఓ దుర్మార్గుడు. పని ఇప్పిస్తామని చెప్పి నమ్మించిన ఆటో డ్రైవర్ రూ. 20 వేలకు వ్యభిచార గృహనికి విక్రయించాడు. ఏడాది కాలంగా ఆమె నరకం అనుభవిస్తోంది. స్థానికుల సహాయంతో ఆమె ఎట్టకేలకు ఆ నరక కూపం నుండి బయటపడింది.
ఖమ్మం జిల్లాకు చెందిన యువతి తల్లిదండ్రులు చనిపోవడంతో ఆమెను పెదనాన్న చేరదీశాడు. వృద్యాప్యం కారణంగా ఆ యువతిని వృద్దుడికి ఇచ్చి వివాహం చేశారు.. అయితే ఈ వివాహం ఇష్టం లేని ఆ యువతి విజయవాడకు పారిపోయి వచ్చింది. విజయవాడ బస్టాప్లో యువతిని ఆటోడ్రైవర్ ట్రాప్ చేసి ఓ మహిళకు రూ. 20వేలకు విక్రయించాడు.
విజయవాడ జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో ఆ యువతిని వ్యభిచార గృహంలోనే మగ్గింది. పలు ప్రాంతాలకు ఆ యువతిని తిప్పి వ్యభిచారం చేయాలని ఇబ్బందిపెట్టినట్టు బాధితురాలు చెబుతున్నారు. ఈ విషయమై పోలీసులకు పిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు.
అయితే స్థానిక మహిళలు ఆమెను కాపాడారు. బాధితురాలితో పాటు స్థానికులు కూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు కారణంగా జక్కంపూడిలో సోదాలు నిర్వహించి వ్యభిచార గృహం నిర్వాహకురాలు శోభారాణిని అదుపులోకి తీసుకొన్నట్టు సీఐ మురళీకృష్ణ చెప్పారు.