అకాల వర్షాలు: అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు
Amaravati: అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పంటనష్టం జరిగింది. పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అకాల వర్షాలు, పంట నష్టంపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తమ ప్రభత్వం రైతులకు అండగా ఉంటుందని తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లో అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పంటనష్టం జరిగింది. పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అకాల వర్షాలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షాల వల్ల జరిగిన పంట నష్టం లెక్కలను వారం రోజుల్లోగా ప్రారంభించాలనీ, దీనికి సంబంధించి నివేదికలు ఇవ్వాలని సూచించారు. ఈ నివేదికల ఆధారంగా రైతులను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు.
మరోవైపు ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వానలు, భారీ గాలులు వీస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
అకాల వర్షాల ప్రభావం పంటలు, పొలాలపై పడటంపై సీఎం నిర్వహించిన సమీక్షలో సీఎంవో అధికారులు పంట నష్టంపై ప్రాథమిక నివేదిక సమర్పించారు. పంట నష్టం సమగ్ర గణనను వెంటనే ప్రారంభించాలని జగన్ రెడ్డి అధికారులను ఆదేశించారనీ, కలెక్టర్లు వారం రోజుల్లో జనాభా గణన పూర్తి చేయాలంటూ ఆదేశాలు ఇచ్చారని అధికార వర్గాలు తెలిపాయి. భారీ వర్షాల కారణంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ, కలెక్టర్లు ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితిని అంచనా వేసి అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.
బాధిత రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని సమాచార, బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ఎస్వీ కృష్ణ అన్నారు. సమీక్షా సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారులు ఇచ్చిన ప్రాథమిక అంచనాల ప్రకారం ఐదు జిల్లాల్లోని 25 మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నారు. నంద్యాల జిల్లాలోని 15 మండలాల్లో మొక్కజొన్న, వరి, కంది, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోని ఐదు మండలాలు, కర్నూలు జిల్లాలోని ఒక మండలం, పార్వతీపురం మన్యం జిల్లాలోని మూడు మండలాల్లో మొక్కజొన్నకు నష్టం వాటిల్లింది. ప్రకాశం జిల్లాలోని ఒక మండలంలో కంది, పత్తి దెబ్బతిన్నాయని మంత్రి తెలిపారు.