Asianet News TeluguAsianet News Telugu

ఏపీకి జీఎస్టీ బకాయిలు.. వైసీపీ ఎంపీ బాలశౌరి ప్రశ్న, నిర్మలా సీతారామన్ సమాధానమిదే

ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన జీఎస్టీ బకాయిలపై వైసీపీ ఎంపీ బాలశౌరీ అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రకటన చేశారు.2022 మే 31 వరకు అన్ని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని .. బ్యాక్ టు బ్యాక్ లోన్ ద్వారా క్లియర్ చేస్తామని ఆర్ధిక మంత్రి ప్రకటించారు. 

union finance minister nirmala sitharaman announcement on GST compensation for ap
Author
First Published Feb 6, 2023, 2:31 PM IST

ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన జీఎస్టీ బకాయిలపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రకటన చేశారు. వైసీపీ ఎంపీ బాలశౌరీ అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించారు. ఏపీకి రావాల్సిన రూ.1268 కోట్లు పెండింగ్‌లో వున్నాయని నిర్మల చెప్పారు. అలాగే ఏపీకి మరో రూ.689 కోట్లు కూడా పెండింగ్‌లో వున్నాయన్నారు. పరిహార నిధి నుంచి త్వరలోనే నిధులను విడుదల చేస్తామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. 2022 మే 31 వరకు అన్ని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని .. బ్యాక్ టు బ్యాక్ లోన్ ద్వారా క్లియర్ చేస్తామని ఆర్ధిక మంత్రి ప్రకటించారు. 

ఇదిలావుండగా.. అదానీ స్టాక్ క్రాష్ కేసుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన తెరపైకి వచ్చింది. ఈ అంశం వల్ల దేశ పరిస్థితి, ప్రతిష్ట దెబ్బతినలేదన్నారు. ఈ అంశంపై ఆర్‌బీఐ ఇప్పటికే వివరణ ఇచ్చింది. ఇంకా ఏజెన్సీలు తమ పని తాము చేసుకుంటున్నాయి. FPOలు ఉపసంహరించుకోవడం ఇదేం మొదటిసారి కాదు, ఇంతకుముందు చాలాసార్లు కూడా FPOలు ఉపసంహరించబడ్డాయి.

అదానీ ఎఫ్‌పిఓ ఉపసంహరణపై ఆర్థిక మంత్రి సమాధానమిస్తూ
మన దేశంలో ఎఫ్‌పిఓను ఉపసంహరించుకోడం ఇదేం మొదటిసారి కాదని  కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ అన్నారు. ఇంతకు ముందు కూడా FPOలు చాలాసార్లు ఉపసంహరించబడ్డాయి.దీని వల్ల భారతదేశ ప్రతిష్ట ఎన్నిసార్లు దిగజారింది ఇంకా ఎన్నిసార్లు FPOలు తిరిగి రాలేదు చెప్పండి ? FPOలు వస్తూ పోతూనే ఉంటాయి అని అన్నారు.

ALso REad: నిరుద్యోగం, ద్ర‌వ్యోల్బ‌ణం.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి బ‌డ్జెట్ తో ప్ర‌యోజ‌నముందా? విశ్లేష‌కులు ఏమంటున్నారంటే..?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా శుక్రవారం దీనికి ముందు కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. భారతీయ బ్యాంకులు  బిజినెస్ గ్రూప్ కి ఇచ్చిన రుణాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ మీడియా నివేదికలు వచ్చాయని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ఆర్‌బిఐ రెగ్యులేటర్ అండ్ సూపర్‌వైజర్‌గా ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడానికి బ్యాంకింగ్ రంగాన్ని ఇంకా వ్యక్తిగత బ్యాంకులను నిరంతరం పర్యవేక్షిస్తుందని  కూడా మేము స్పష్టం చేయాలనుకుంటున్నాము.  

RBIకి సెంట్రల్ రిపోజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్ (CRILC) డేటాబేస్ సిస్టమ్ ఉందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ఇక్కడ బ్యాంకులు ఎక్స్పోజర్ రూ. 5 కోట్లు అండ్ అంతకంటే ఎక్కువ ఉన్నట్లు నివేదిస్తాయి. బ్యాంకుల భారీ రుణాలపై నిఘా పెట్టేందుకు దీన్ని వినియోగిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది.

 

Follow Us:
Download App:
  • android
  • ios