విశాఖపట్నంలో కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం.. ఇద్దరు మృతి, ఐదుగురికి గాయాలు
విశాఖపట్నంలోని రామజోగిపేటలో బుధవారం రాత్రి ఓ బిల్డింగ్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో వ్యక్తి కోసం రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపడుతోంది.
విశాఖపట్నంలోని కలెక్టర్ కార్యాలయం దగ్గరలో ఉన్న రామజోగిపేటలో మూడు అంతస్తుల బిల్డింగ్ కూలిపోయింది. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. వారిని 14 ఏళ్ల సాకేటి అంజలి, 17 ఏళ్ల దుర్గాప్రసాద్గా గుర్తించారు.
నిన్న మాధవ్, ఈరోజు వీర్రాజు.. ఆ మాటల్లో ఆంతర్యం ఏంటీ, జనసేనతో బీజేపీ కటీఫేనా..?
బిల్డింగ్ కుప్పకూలిన ఘటనలో మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వీరితో పాటు ఎన్డీఆర్ఎఫ్, రెవెన్యూ టీమ్స్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. వెంటనే సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యాయి.
ఉన్నట్టుండి ఒక్క సారిగా బిల్డింగ్ కుప్పకూలడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో బిల్డింగ్ లో 8 మంది ఉన్నారు. అయితే ఇద్దరు మరణించగా.. మరో ఐదుగురు ప్రాణాలతో భయటపడ్డారు. మరో వ్యక్తి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. అతడి కోసం రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపడుతోంది. ఈ ఘటనలో ఐదుగురి క్షతగాత్రులను చికిత్స కోసం హాస్పిటల్ కు తీసుకెళ్లారు. బిల్డింగ్ కుప్పకూలిన ప్రదేశాన్ని పోలీసులు ఉన్నతాధికారులు పరిశీలించారు.