Asianet News TeluguAsianet News Telugu

సంచలనాలకు మారుపేరు వల్లభనేని వంశీ, ఇప్పుడూ అంతే...

ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచనాలు సృష్టించారు. ఏ నిర్ణయం తీసుకొన్నా కూడ  వంశీ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు.తాజాగా వంశీ ఎమ్మెల్యే పదవితో పాటు టీడీపీ సభ్యత్వానికి కూడ రాజీనామా చేశారు. 

TDP MLA Vallabhaneni Vamshi Creates sensation in his Political History
Author
Vijayawada, First Published Oct 28, 2019, 12:08 PM IST


విజయవాడ: టీడీపీ నేత వల్లభనేని వంశీ ఏ నిర్ణయం తీసుకొన్నా సంచలనమే. సంచలనాలకు వల్లభనేని వంశీ కేంద్ర బిందువుగా నిలుస్తారు. మీడియాకు దూరంగా ఉంటూనే మీడియాలో  పతాక శీర్షికల్లో నిలుస్తారు. 

Also Read: చంద్రబాబు ప్రతిపక్ష హోదాకు ఎసరు: జగన్ కి టచ్ లో 10మంది టీడీపీ ఎమ్మెల్యేలు.

తాను తీసుకొనే నిర్ణయాలతో ప్రత్యర్ధులను ఉక్కిరిబిక్కిరి చేస్తారు. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న వంశీ ప్రత్యర్ధుల సవాళ్లకు ధీటుగానే స్పందించారు. కానీ,  నకిలీ ఇళ్లపట్టాల కేసు విషయమై వంశీ టీడీపీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మరో వైపు రాజకీయాలకు దూరంగా ఉంటానని  ప్రకటించారు.

Also Read:ఇద్దరూ ఎన్టీఆర్ ఫ్యాన్స్: జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ వెనుక నాని

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2009 ఎన్నికల్లో విజయవాడ ఎంపీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన వల్లభనేని వంశీ కాంగ్రెస్ అభ్యర్ధి లగడపాటి రాజగోపాల్ చేతిలో ఓటమి పాలయ్యాడు. వాస్తవానికి ఆ ఎన్నికల్లో వల్లభనేని వంశీ గన్నవరం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయాలని రంగం సిద్దం చేసుకొన్నారు. 

Also Read: అండగా ఉంటా, అది సరైంది కాదు: వల్లభనేని వంశీకి బాబు ధైర్యం

కానీ ఆ అసెంబ్లీ స్థానంలో  దాసరి బాలవర్ధన్ రావుకు టిక్కెట్టు కేటాయించడంతో వల్లభనేని వంశీకి చంద్రబాబునాయుడు విజయవాడ ఎంపీ టిక్కెట్టు ఇచ్చారు. విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత కూడ టీడీపీ విజయవాడ సిటీ కమిటీ అధ్యక్షుడిగా చాలా కాలం పాటు పనిచేశారు.

Also Read: చంద్రబాబు లేఖకు వల్లభనేని వంశీ జవాబు ఇదీ..

2014,2019 ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. నకిలీ ఇళ్ల పట్టాలపై వల్లభనేని వంశీపై కేసులు నమోదయ్యాయి.ఈ కేసుల వెనుక స్థానిక వైసీపీ ఇంచార్జీ యార్లగడ్డ వెంకట్రావు ఉన్నాడని వంశీ ఆధారాలతో సహా మీడియాకు వివరించారు. ఈ ఘటన జరిగిన మరునాడే వల్లభనేని వంశీ సీఎం జగన్ ను మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరిని కలిశారు.

Also Read: వల్లభనేని రాజీనామా వెనక వైఎస్ జగన్ వ్యూహం ఇదే...

ఈ నెల 27వ తేదీన ఎమ్మెల్యే పదవికి, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టుగా వల్లభనేని వంశీ ప్రకటించారు. అంతేకాదు రాజకీయాలకు దూరంగా ఉంటానని కూడ ప్రకటించడం కూడ సంచలనంగా మారింది.ఇదే విషయమై ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా చర్చ సాగుతోంది.

2014 ఎన్నికలకు ముందు కూడ వల్లభనేని వంశీ తీసుకొన్న కొన్ని నిర్ణయాలు  సంచలనంగా మారాయి. అప్పట్లో విజయవాడ సీపీగా ఉన్న ఓ ఐపీఎస్ అధికారికి వల్లభనేని వంశీకి మధ్య వివాదం కొనసాగింది.

Also Read: వల్లభనేని వంశీ రాజీనాామాపై బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు

అయితే ఐపీఎస్ అధికారి మహిళలకు పంపిన మేసేజ్‌ల విషయమై అప్పట్లో ఓ తెలుగు న్యూస్  ఛానెల్‌ కథనాన్ని ప్రసారం చేసింది. ఆ లైవ్ లో పాల్గొన్న ఐపీఎస్ అధికారి వంశీని ట్రాప్ చేసేందుకు మేసేజ్ పంపినట్టుగా చెప్పారు.  ఈ ఘటన తర్వాత ఆ ఐపీఎస్ అధికారి విజయవాడ నుండి బదిలీపై వచ్చాడు.

ఆ ఐపీఎస్ అధికారి అప్పటి కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని అప్పట్లో వంశీ విమర్శించారు. నెహ్రు సూచన మేరకు టీడీపీ కార్యకర్తలను పోలీసులు కౌన్సిలింగ్ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని వంశీ ఆరోపణలు చేశారు.

2014 జనవరి 20వ తేదీన ఐపీఎస్  అధికారి ఒకరు తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వల్లభనేని వంశీ అప్పటి డీజీపీ ప్రసాదరావుకు ఫిర్యాదు చేశారు. మాజీ నక్సలైట్ల సహాయంతో తనను అంతం చేసేందుకు కుట్ర చేశారని వంశీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వంశీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

2014 ఎన్నికలకు ముందు విజయవాడలో  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ర్యాలీ సాగుతున్న సమయంలో దమ్ము సినిమా చూసి వస్తున్న వల్లభనేని వంశీ వెళ్తుండగా విజయవాడ బెంజీ సర్కిల్ లో జగన్‌ను కౌగిలించుకొన్నారు. ఈ ఘటన ఆ నాడు టీడీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ విషయమై వల్లభనేని వంశీ చంద్రబాబునాయుడుకు అప్పట్లో వివరణ ఇచ్చారు. అప్పటికే కొడాలి నాని టీడీపీని వీడి వైసీపీలో చేరారు. వల్లభనేని వంశీ కూడ వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగింది. కానీ వల్లభనేని వంశీ టీడీపీలోనే కొనసాగారు.

2014లో అవశేష ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత  కూడ వల్లభనేని వంశీ తీసుకొన్న కొన్ని నిర్ణయాలు కూడ సంచలనంగా మారాయి.

ఏపీలో చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో తనకు సెక్యూరిటీ పెంచాలని కోరారు.  కానీ, సెక్యూరిటీని పెంచలేదు. వంశీకి వన్ ప్లస్ వన్ గన్‌మెన్ మాత్రమే ఉన్నారు. అయితే టూ ప్లస్ టూ గన్‌మెన్ ఇవ్వాలని  వల్లభనేని వంశీ  2017 సెప్టెంబర్ 19 తన గన్‌మెన్లను వెనక్కి పంపారు.

మరోవైపు తన నియోజకవర్గంలోని రైతుల సమస్యపై ప్రభుత్వం స్పందించనందుకు నిరసనగా వల్లభనేని వంశీ రాజీనామా లేఖను అప్పట్లోనే సంధించారు. అయితే ఆ సమయంలో టీడీపీ నేతలు ఆయనకు సర్ధిచెప్పారు. రైతులకు  అండగా వల్లభనేని వంశీ ఆందోళన కూడ చేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో వల్లభనేని వంశీ కొంచెం వెనక్కు తగ్గారు.

2019 ఎన్నికలు పూర్తయ్యాక గన్నవరం అసెంబ్లీ స్థానంలో వైసీపీ అభ్యర్ధి వెంకట్రావు గెలిస్తే తాను సన్మానం చేస్తానని ప్రకటించారు. వెంకట్రావు ఇంటికి వెళ్లాడు వల్లభనేని వంశీ. ఈ విషయమై యార్లగడ్డ వెంకట్రావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ విషయమై ఫేస్‌బుక్ వేదికగా వల్లభనేని వంశీ యార్లగడ్డ వెంకట్రావు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. 

ఎన్నికలకు ముందు నకిలీ ఇళ్ల స్థలాల పట్టాలను ఇచ్చిఎన్నికల్లో గెలుపొందారని వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు వల్లభనేని వంశీపై ఆరోపణలు చేస్తున్నారు.ఈ విషయమై వల్లభనేని వంశీపై కేసులు నమోదయ్యాయి.

ఈ కేసు వెనుక ఎవరున్నారనే విషయమై ఈ నెల 24 వతేదీన మెయిల్ ఆధారాలతో వంశీ మీడియాకు వివరించారు. ఆ మరునాడు మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరితో భేటీ అయ్యారు. అదే రోజు సాయంత్రం తన స్నేహితుడు, మంత్రి కొడాలి నానితో కలిసి వల్లభనేని వంశీ ఏపీ సీఎం జగన్ ను కలిశారు.

వంశీ టీడీపీని వీడి వైసీపీలో చేరుతారని ప్రచారం సాగింది. వంశీ వైసీపీలో చేరుతోందనే ప్రచారం నేపథ్యంలో యార్లగడ్డ వెంకట్రావు ఇంటి వద్ద వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వల్లభనేని వంశీ పార్టీలో చేరకుండా అడ్డుకోవాలని కోరారు.

ఈ పరిణామాలతో ఈ నెల 28న ఏపీ సీఎం జగన్ ను కలుస్తానని యార్లగడ్డ వెంకట్రావు ప్రకటించారు. మరోవైపు వల్లభనేని వంశీ మాత్రం ఈ ఊహాగానాలకు తెరదించుతూ టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు రాజకీయాలకు కూడ గుడ్ బై చెబుతున్నట్టుగా వంశీ ప్రకటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios