స్థానిక ఎన్నికల్లో నిరాశ: ఈ నెల 12 నుండి కుప్పంలో బాబు టూర్
ఈ నెల 12 నుండి 14వ తేదీ వరకు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు పర్యటించనున్నారు. కుప్పం నియోజకవర్గంలో బాబు టూర్ ప్రాధాన్యత నెలకొంది.
చిత్తూరు: తన స్వంత నియోజకవర్గం kuppam assembly నియోజకవర్గంలో ఈ నెల 12 నుండి 14వ తేదీ వరకు tdp చీఫ్ చంద్రబాబునాయుడు పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ ఘోర పరాజయం పొందింది. ఈ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంది. అయినా కొన్ని స్థానాల్లో టీడీపీ నేతలు పోటీ చేసినా ఆ పార్టీకి ఆశించిన ఫలితం రాలేదు. కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో ycp మెజారిటీ స్థానాలను దక్కించుకొంది. దీంతో కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో chandrababu naidu టూర్ ప్రాధాన్యత సంతరించుకొంది.
also read:బాబును జనం నమ్మలేదు.. కుప్పంలోనే టీడీపీ బొల్తా పడింది: పరిషత్ ఫలితాలపై సజ్జల వ్యాఖ్యలు
మూడు రోజుల పాటు చంద్రబాబునాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఈ నెల 12న కుప్పంలో బహిరంగ సభలో బాబు పాల్గొంటారు. అదే రోజున కుప్పం పట్టణంలో పర్యటిస్తారు. ఈ నెల 13న శాంతిపురం, రామకుప్పం మండలాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. ఈ నెల 14న చంద్రబాబునాయుడు కుప్పం రూరల్ మండలంలో పర్యటిస్తారు. అదే రోజు గుడుపల్లి మండలంలో పర్యటించనున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల నుండి కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంపై వైసీపీ కేంద్రీకరించింది. గత ఎన్నికల సమయంలో తొలి రెండు రౌండ్లలో చంద్రబాబునాయుడు వెనుకంజలో ఉన్నారు. ఆ తర్వాత ఆయన ప్రతి రౌండ్లో సమీప వైసీపీ అభ్యర్ధిపై ముందంజలో నిలిచారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కుప్పం అసెంబ్లీ స్థానంలో కూడ ఆధిపత్యం సాధించాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఈ అసెంబ్లీ నియోజకవర్గంపై ఏపీ మంత్రి peddireddy ramachandra reddy కేంద్రీకరించి పనిచేస్తున్నారు.