పోలీసులను చూసి భయంతో ఓ వాహనాన్ని వదిలేసి డ్రైవర్ పారిపోయాడు. ఈ వాహనంలో పెద్ద ఎత్తున గంజాయి ఉందని చివరికి పోలీసులకు గుర్తించారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పలాసలో చోటు చేసుకొంది.
పలాస: పోలీసులను చూసి భయంతో ఓ వాహనాన్ని వదిలేసి డ్రైవర్ పారిపోయాడు. ఈ వాహనంలో పెద్ద ఎత్తున గంజాయి ఉందని చివరికి పోలీసులకు గుర్తించారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పలాసలో చోటు చేసుకొంది.
పలాస మండలం లక్ష్మీపురం జాతీయ రహదారి టోల్ప్లాజా ప్రాంతంలో మంగళవారం నాడు మధ్యాహ్నం పోలీస్ వాహనాన్ని చూసిన ఓ వ్యాన్ డ్రైవర్ శ్రీకాకుళం నుండి ఇచ్ఛాపురం వైపు వెళ్తున్న బోలేరో వ్యాన్ ను రోడ్డుపైనే నిలిపివేసి పారిపోయాడు.
పోలీసులు ఈ వ్యాన్ ను తనిఖీ చేస్తే అందులో గంజాయి దొరికింది. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రిజిస్ట్రేషన్ తో ఈ వ్యాన్ ఉంది. వ్యాన్ వెనుక కింది భాగంలో ప్రత్యేకంగా తయారు చేసిన ట్రేలో 63 ప్యాకెట్లలో గంజాయిని తరలిస్తున్నట్టుగా గుర్తించినట్టుగా కాశీబుగ్గ సీఐ శంకర్ రావు తెలిపారు.
స్వాధీనం చేసుకొన్న గంజాయి విలువ సుమారు. 5 లక్షలు ఉంటుందని పోలీసులు చెప్పారు. డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 13, 2021, 12:10 PM IST