Asianet News TeluguAsianet News Telugu

అల్లూరి జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి, మరో ముగ్గురికి గాయాలు

అల్లూరి జిల్లాలోని  చింతూరులో  మంగళవారంనాడు  జరిగిన  రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.  మరో  ముగ్గురు  గాయపడ్డారు.మృతులంతా  ఛత్తీస్‌ఘడ్  రాష్ట్రానికి  చెందినవారు.

 Six  Killed  in Road  accident  in  Alluri  District
Author
First Published Nov 22, 2022, 3:53 PM IST

చింతూరు: అల్లూరి జిల్లాలోని  చింతూరు మండలంలో  మంగళవారంనాడు  జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు  మృతి  చెందారు. వ్యాన్, లారీ డీకొనడంతో ఈ ప్రమాదం  చోటు  చేసుకుంది.  చింతూరు  మండలం  బొడ్డుగూడెంలో  ఈ  ప్రమాదం  జరిగింది. ఈ ప్రమాదంలో  ఆరుగురు  మృతి చెందారు.మరో  ముగ్గురు  గాయపడ్డారు. గాయపడిన  వారిని సమీపంలోని  ఆసుపత్రికి  తరలించారు. భద్రాచలంలో  శ్రీరామచంద్రస్వామని  దర్శించుకొని  చత్తీస్ ఘడ్ కు  వెళ్తున్న సమయంలో  ఈ ప్రమాదం  చోటు  చేసుకుంది.  వ్యాన్  డ్రైవర్  అతివేగంగా  వాహనాన్ని నడపడంతోనే  ఈ ప్రమాదం  జరిగిందని  ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 

దేశ  వ్యాప్తంగా  పలు రాష్ట్రాల్లో రోజుకు  పలు రోడ్డు ప్రమాదాలు  జరుగుతున్నాయి. డ్రైవర్ల  నిర్లక్ష్యంతో పాటు , రోడ్లు  సరిగా  లేని  కారణంగా  ప్రమాదాలు  జరుగుతున్నాయి.  నిద్రమత్తులో  డ్రైవింగ్ చేయడంతో పాటు అతి వేగంగా  డ్రైవింగ్ చేయడంతో  ప్రమాదాలు  చోటు  చేసుకుంటున్నాయి.యూపీ  రాష్ట్రంలోని  ఆజంఘడ్  లో  ఈ  నెల  20వ  తేదీన రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఇద్దరు మృతి  చెందారు. తెలంగాణలోని  వనపర్తి జిల్లాలోని కొత్తకోట మండలం బొమ్మలపల్లి  వద్ద  జరిగిన  రోడ్డు ప్రమాదంలో  ముగ్గురు  మృతి  చెందారు.ఈ  ఘటన ఈ నెల 20వ  తేదీన జరిగింది.

ఆర్టీసీ  బస్సు ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో  ఈ ప్రమాదం జరిగింది.  హైద్రాబాద్  నుండి  బెంగుళూరు  ఆర్టీసీ  బస్సు  వెళ్తుంది. ఈ  నెల 16న ఉత్తరాఖండ్  లో  జరిగిన  రోడ్డు ప్రమాదంలో పది  మంది  మృతి  చెందారు. చమోలి  వద్ద  బస్సు లోయలో పడడంతో  ఈ  ప్రమాదం  చోటు  చేసుకుంది. సత్యసాయి  జిల్లాలోని  కనగానపల్లి  మండలం  పర్వతదేవరపల్లి వద్ద  కల్వర్టు గోడను  కారు  ఢీకొనడంతో  ముగ్గురు మృతి  చెందారు.మధ్యప్రదేశ్  రాష్ట్రంలోని దరియా పోలీస్ స్టేషన్ పరిధిలో  ఈ  నెల  6వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో  ముగ్గురు మృతి చెందారు.మరో  25  మంది  గాయపడ్డారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios