Asianet News TeluguAsianet News Telugu

అంతర్వేది ఘటన మరువక ముందే...నిడమానూరులో సాయిబాబా విగ్రహం ధ్వంసం (వీడియో)

అంతర్వేది రధం దగ్దం ఘటన మరువక ముందే  కృష్ణా జిల్లాలో అలాంటి దుర్ఘటనే మరోటి చోటుచేసుకుంది. 

Shirdi Saibaba Statue Destroyed in krishna district
Author
Vijayawada, First Published Sep 16, 2020, 10:32 AM IST

విజయవాడ: అంతర్వేది రధం దగ్దం ఘటన మరువక ముందే  కృష్ణా జిల్లాలో అలాంటి దుర్ఘటనే మరోటి చోటుచేసుకుంది. విజయవాడ రూరల్ మండలం నిడమానూరులోని ఓ ఆలయంలో సాయిబాబా విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. షిర్డీ సాయిబాబా మందిరం వద్ద బయట వైపు నెలకొల్పిన బాబా విగ్రహాన్ని మంగళవారం అర్ధరాత్రి దుండగులు ధ్వంసం చేయగా ఉదయం స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఈ ఫిర్యాదు మేరకు సీఐ సురేష్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. హిందూ ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 

వీడియో

"

Follow Us:
Download App:
  • android
  • ios