ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ..
ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీచేశారు.
ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. స్టేట్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్గా గిరిజా శంకర్ బదిలీ అయ్యారు. పౌరసరఫరాల శాఖ స్పెషల్ సెక్రటరీ, కమిషనర్గా అరుణ్ కుమార్ను బదిలీ చేశారు. జీఏడీ సెక్రటరీగా పోల భాస్కర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీచేశారు. ఇక, గత నెలలో కూడా ఏపీ సర్కార్ పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టిన సంగతి తెలిసిందే.