Asianet News TeluguAsianet News Telugu

వలంటీర్ పై దోపిడీ దొంగల దాడి.. ఆసరా పింఛన్ల సొమ్ము మాయం...

అనంతపురం జిల్లా మడకశిరలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. గురువారం ఉదయం జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. అక్టోబర్ నెల మొదటి రోజు కావడంతో పింఛన్లు పంపిణీ చేసేందుకు వెల్తున్న వలంటీర్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి తెగబడ్డారు.

Robbers attacked volunteer at  madakasira, anantapur
Author
Hyderabad, First Published Oct 1, 2020, 12:17 PM IST

అనంతపురం జిల్లా మడకశిరలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. గురువారం ఉదయం జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. అక్టోబర్ నెల మొదటి రోజు కావడంతో పింఛన్లు పంపిణీ చేసేందుకు వెల్తున్న వలంటీర్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి తెగబడ్డారు.

వాలంటీర్ వీరప్ప దగ్గరున్న డబ్బులు లాక్కుని, కళ్లలో కారం కొట్టి వెళ్లారు. వీరప్ప దగ్గర ఆ సమయంలో వీరప్ప దగ్గరున్న 43 వేల రూపాయలు దుండగుల పాలయ్యింది. 

మడకశిర పట్టణంలోని శివపురలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. దుండ‌గుల కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. 

వీరప్ప కార్యకలాపాలు తెలిసినవారే పక్కాగా ప్లాన్ తో ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.  వెంటనే దొంగలను పట్టుకునేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

వృద్ధులకిచ్చే ఆసరా పింఛన్ల పంపిణీ సమయంలో ఈ దోపిడీ జరగడంతో స్థానికులు మండిపడుతున్నారు. ముసలివారి కడుపుకొట్టడానికి ఆ దొంగలకు మనసెలా వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వెంటనే దొంగలను పట్టుకుని వృద్ధులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

కాగా ఈ దోపిడి నేపథ్యంలో వాలంటీర్లు జాగ్రత్తగా ఉండాలని, డబ్బులు క్యారీ చేస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios