ఉండవల్లిలో కలకలం: చంద్రబాబు నివాసం వద్ద కారు బోల్తా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారిక నివాసం వద్ద కారు బోల్తా పడటం కలకలం రేపింది. గురువారం మధ్యాహ్నం అమరావతి నుంచి ఉండవల్లి వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి పంట పొలాలలోకి దూసుకెళ్లింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారిక నివాసం వద్ద కారు బోల్తా పడటం కలకలం రేపింది. గురువారం మధ్యాహ్నం అమరావతి నుంచి ఉండవల్లి వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి పంట పొలాలలోకి దూసుకెళ్లింది.
ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో సీఎం నివాసం మీదుగా వెళ్లే మార్గంలో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్దీకరిస్తున్నారు.