Asianet News TeluguAsianet News Telugu

సంవత్సరం నుండి ప్రయత్నిస్తున్నా...అయినా దక్కని సీఎం అపాయింట్ మెంట్: ఊర్మిల

ప్రఖ్యాత మహారాజా కాలేజీని ప్రైవేటుపరం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నామని పూసపాటి వంశీయురాలు ఊర్మిల తెలిపారు. 

pusapati urmila gajapathi raju reacts on maharaja college privatisation
Author
Vijayanagaram, First Published Oct 7, 2020, 7:45 AM IST

విజయనగరం: ఇప్పటికే పూసపాటి వంశీయుల ఆధ్వర్యంలో నడిచే మాన్సాస్ ట్రస్ట్ విషయంలో వివాదం కొనసాగుతుండగా జగన్ ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం ఆ వంశీయుల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది. ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచే  మహారాజా(ఎంఆర్) కాలేజీని ప్రైవేటికరించాలన్న వైసిపి ప్రభుత్వ నిర్ణయాన్ని పూసపాటి వంశీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంపై తాజాగా మాజీ మంత్రి ఆనంద గజపతిరాజు కుమార్తె పూసపాటి ఊర్మిళ గజపతి రాజు స్పందించారు. 

ప్రఖ్యాత మహారాజా కాలేజీని ప్రైవేటుపరం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరడానికి సంవత్సరం కాలంగా సీఎం జగన్ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నా లభించడం లేదన్నారు.  తన  తాత, తండ్రుల పేరును చెడగొట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎంతో చరిత్ర కలిగిన ఈ కళాశాల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాధాకరమన్నారు. ఈ కాలేజీలో చదివిన వారు ప్రస్తుతం దేశ విదేశాల్లో మంచి స్థానాల్లో వున్నారన్నారు. ఈ కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడాన్ని తాము అంగీకరించబోమని... దయచేసి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని  ఊర్మిల కోరారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios