యువకులను చితకబాదిన పోలీసులు (వీడియో)
- ఎటువంటి విచారణ చేయకుండానే వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు.
పశ్చిమగోదావరి జిల్లాలోని అచంటలో పోలీసుల ఓవరాక్షన్ కలకలం రేపింది. శివరాత్రి వేడుకల్లో యువతులను ఈవ్టీజింగ్ చేశారని కొంతమంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎటువంటి విచారణ చేయకుండానే వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. అంతటితో అగకుండా పీఎస్లోనే ఆ యువకులపై చేయి చేసుకున్నారు. ఈ దృశ్యాలను వీడియోలో చిత్రీకరిస్తున్న మీడియాపై పోలీసులు చిందులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది.