Asianet News TeluguAsianet News Telugu

ఛలో అసెంబ్లీ: టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పోలీసుల నోటీసులు

ఛలో అసెంబ్లీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆదివారం నాడు నోటీసులు జారీ చేశారు. 

police issues notice to TDP legislators in andhra pradesh
Author
Amaravathi, First Published Jan 19, 2020, 12:03 PM IST

అమరావతి: ఛలో అసెంబ్లీని పురస్కరించుకొని టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పోలీసులు ఆదివారం నాడు నోటీసులు జారీ చేశారు.

ఈ నెల 20వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున అసెంబ్లీని ముట్టడించేందుకు అమరావతి జేఎసీ పిలుపునిచ్చింది. చలో అసెంబ్లీ కార్యక్రమానికి టీడీపీ మద్దతు ఇచ్చింది.  దీంతో పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకొంటున్నారు.

Also read:అసెంబ్లీ సమావేశాలకు అటంకం కలిగిస్తే కఠిన చర్యలు: గుంటూరు ఐజీ హెచ్చరిక

విజయవాడ ఎంపీ కేశినేని నాని, టీడీపీ శాసనసభపక్ష ఉపనాయకుడు అచ్చెన్నాయుడు, టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Also read:వంశీ, మద్దాల గిరికి టీడీపీ విప్:వ్యూహాత్మకంగా టీడీపీ అడుగులు

మరో వైపు టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు,  ఎమ్మెల్సీలతో పాటు పలువురికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.  ఛలో అసెంబ్లీ నేపథ్యంలో  పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటున్నారు. ఈ చర్యల్లో భాగంగానే  పోలీసులు టీడీపీకి చెందిన  ప్రజా ప్రతినిధులకు నోటీసులు ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios