బీజేపీలో చేరిన పరిపూర్ణానంద స్వామి
పరిపూర్ణానంద స్వామి బీజేపీ పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో పరిపూర్ణానంద బీజేపీలో చేరారు. అమిత్ షా పరిపూర్ణానంద స్వామికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. సిద్ధాంతాలు నచ్చి బీజేపీలో చేరానని పరిపూర్ణానంద తెలిపారు. తాను ఏమీ ఆశించకుండా పార్టీలో చేరానని బీజేపీ సిద్ధాంతాలను నలుమూలల వ్యాపింప చెయ్యడమే తన లక్ష్యమని చెప్పారు.
ఢిల్లీ: పరిపూర్ణానంద స్వామి బీజేపీ పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో పరిపూర్ణానంద బీజేపీలో చేరారు. అమిత్ షా పరిపూర్ణానంద స్వామికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. సిద్ధాంతాలు నచ్చి బీజేపీలో చేరానని పరిపూర్ణానంద తెలిపారు.
తాను ఏమీ ఆశించకుండా పార్టీలో చేరానని బీజేపీ సిద్ధాంతాలను నలుమూలల వ్యాపింప చెయ్యడమే తన లక్ష్యమని చెప్పారు. తనకు ప్రజలు ఎన్నో ఇచ్చారని అంతకు మించే తనకు ఏమీ అవసరం లేదని చెప్పారు.
మరోవైపు ఈనెల 8న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పరిపూర్ణానంద సమావేశం అయ్యారు. తాను ఈనెల 19న బీజేపీలో చేరనున్నట్లు షాకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పరిపూర్ణానంద స్వామి బీజేపీ కండువా కప్పుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
పొలిటికల్ ఎంట్రీపై స్వామి పరిపూర్ణానంద ఆసక్తికర వ్యాఖ్యలు
బీజేపీలోకి పరిపూర్ణానంద స్వామి
హైదరాబాద్ చేరుకున్న స్వామి పరిపూర్ణానంద ధర్మజ్వాల ర్యాలీ
పరిపూర్ణానందపై బహిష్కరణ ఎత్తివేత.. నేడు నగరానికి రాక
రాజకీయాల్లోకి పరిపూర్ణానంద స్వామి..?