Asianet News TeluguAsianet News Telugu

రఘురామకృష్ణంరాజు కేసు: ఏపీ సర్కార్‌కి జాతీయ మానవహక్కుల కమిషన్ సమన్లు

ఏపీ ప్రభుత్వంపై జాతీయ మానవహక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ రాష్ట్ర హోం సెక్రటరీ, డీజీపీలకు సమన్లు జారీ చేసింది.

NHRC serious on AP government over Raghurama krishnam raju issue lns
Author
Guntur, First Published Jun 29, 2021, 4:38 PM IST

న్యూఢిల్లీ: ఏపీ ప్రభుత్వంపై జాతీయ మానవహక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ రాష్ట్ర హోం సెక్రటరీ, డీజీపీలకు సమన్లు జారీ చేసింది.నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్‌పై నివేదిక పంపాలని ఏపీ ప్రభుత్వానికి జాతీయ మానవహక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. గతంలోనే ఈ నోటీసులు జారీ చేసినా ప్రభుత్వం నుండి స్పందన రాలేదు. నివేదిక పంపండంలో ఎందుకు జాప్యం అవుతుందని  జాతీయ మానవహక్కుల కమిషన్ ప్రశ్నించింది. తాజాగా కండిషనల్ సమన్లు జారీ చేసింది. ఈ ఏడాది ఆగష్టు 9వ తేదీలోపుగా నివేదికను సమర్పించాలని ఆదేశించింది.

also read:మా చెల్లికి పెళ్లి... జరగాలి మళ్ళీ మళ్లీ అన్నట్లుంది జగన్ తీరు: మరో లేఖలో రఘురామ ఎద్దేవా

రఘురామకృష్ణంరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడంపై  ఆయన కొడుకు భరత్ జాతీయ మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేసిన సమయంలో సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరును ఈ ఫిర్యాదులో భరత్ ప్రస్తావించారు. రఘురామపై పోలీసుల దాడి విషయంలో అంతర్గత విచారణకు కూడ ఎన్‌హెచ్‌ఆర్‌సీ  ఆదేశాలు జారీ చేసింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios