అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని చిన్నారి ప్రసవించిన ఘటన కలకలం రేపుతోంది. కస్తుర్భా పాఠశాలలో చదువుతున్న14 ఏళ్ల బాలిక ఓ బిడ్డను ప్రసవించింది.
అనంతపురం: అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని చిన్నారి ప్రసవించిన ఘటన కలకలం రేపుతోంది. కస్తుర్భా పాఠశాలలో చదువుతున్న14 ఏళ్ల బాలిక ఓ బిడ్డను ప్రసవించింది.
Add Asianetnews Telugu as a Preferred Source

జిల్లా కేంద్రమైన అనంతపురంలోని పాతూరులో ఉన్న కస్తుర్భా పాఠశాలలో ఓ బాలిక తొమ్మిదో తరగతి చదువుతుంది. అయితే ఆ బాలిక గురువారం అర్ధరాత్రి అనంతపురంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించినట్లు సమాచారం. ప్రసవించిన కొద్ది సేపటికే శిశువు మృతిచెందినట్లు తెలిసింది. మైనర్ బాలిక, అందులో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్ధిని ప్రసవించడం సంచలనం కలిగిస్తోంది.
ఇవి కూడా చదవండి
అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని అత్తను చంపిన కోడలు
