‘‘పోలవరం ప్రాజెక్టు రికార్డు సాధించింది’’
మీడియాతో మంత్రి దేవినేని
నిర్మాణపరంగా పోలవరం ప్రాజెక్టు మరో రికార్డు సాధించిందని మంత్రి దేవినేని ఉమామహేశ్వర్రావు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ స్పిల్ ఛానల్, స్పిల్ వే పనుల్లో ఒక్కరోజులో 11,158 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులతో రికార్డు సాధించామన్నారు. దేశంలో ఏ సాగునీటి ప్రాజెక్టులో ఈస్థాయి కాంక్రీట్ పనులు చేయలేదని చెప్పారు. చైనా త్రీగోర్జెస్ డ్యామ్లో 24 గంటల్లో 13వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరిగాయని, జులైనాటికి చైనా రికార్డును కూడా అధిగమిస్తామని మంత్రి దేవినేని స్పష్టం చేశారు.