గ్రామ వాలంటీర్ గా పనిచేస్తున్న భార్యపై అనుమానంతో ఆమె భర్త సెల్పీ వీడియోను చిత్రీకరించుకుని ఆత్మహత్యకు పాల్పడిన దుర్ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.  

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేమవరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్య పట్ల అనుమానంతో భర్త పురుగులమందు తాగి ఆత్మమత్యకు పాల్పడ్డాడు. అయితే అతడి తన ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ సెల్ఫీ వీడియోను రికార్డుచేస్తూనే పురుగుల మందు తాగాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఇలా సెల్పీ వీడియోను చిత్రీకరించుకుని ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి వేమవరం గ్రామానికే చెందిన గోపిగా గుర్తించారు. అతడి భార్య అదే గ్రామంలో గ్రామ వాలంటిర్ గా పనిచేస్తోంది. ఆమె ప్రవర్తనతో మనస్తాపానికి గురయి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు గోపి సూసైడ్ సెల్పీ వీడియోలో పేర్కొన్నాడు. 

సూసైడ్ సెల్ఫీ వీడియో

"