Asianet News TeluguAsianet News Telugu

చెల్లి వరుసయ్యే అమ్మాయికి లవ్ ప్రపోజ్.. ఒప్పుకోలేదని కారుతో గుద్ది...

చెల్లి వరుసయ్యే అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేశాడో ప్రబుద్ధుడు. దీనికి ఆమె అంగీకరించలేదు. దీంతో కోపం పెంచుకుని.. స్కూటీమీద వెడుతున్న ఆమెను కారుతో గుద్ది హత్యాయత్నం చేశాడు. 

man hits woman with car over rejected his love in anantapur
Author
Hyderabad, First Published Aug 3, 2022, 1:28 PM IST

అనంతపురం : వావివరుసలు మరిచిన ఓ వ్యక్తి చెల్లె వరుస అయ్యే అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఆమె దీనికి నిరాకరించడంతో దారుణానికి తెగించాడు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. భాస్కర్ అనే యువకుడు కొంతకాలంగా మైథిలి అనే యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అయితే వరసకు అన్న కావడంతో భాస్కర్ ప్రేమను యువతి నిరాకరించింది. 

తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో స్కూటీపై వెడుతున్న మైథిలిని కారుతో ఢీకొట్టాడు భాస్కర్.  కంబదూరు మండలం బోయినపల్లి దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో యువతి మైథిలికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించారు. నిందితుడు భాస్కర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

న్యాయవాది మల్లారెడ్డి హత్య కేసులో ట్విస్ట్... మర్డర్ కు భారీ స్కెచ్, రూ. 10 లక్షల సుపారీ..

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే  తెలంగాణలోని మహబూబాబాద్ లో జరిగింది. వారిద్దరు తోడబుట్టిన అన్నాచెల్లెలు.. కానీ కట్టుబాట్లను కాదని వివాహేతర సంబంధంపెట్టుకున్నారు. తన సంబంధానికి అడ్డుగా ఉందని ఆమె తన భర్త ద్వారా పుట్టిన బిడ్డను సోదరుడితో కలిసి కడతేర్చింది. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. కేసముద్రం మండలం నర్సింహులగూడెంకు చెందిన శిరీషకు కట్టుగూడెంకు చెందిన అశోక్ తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి అనుశ్రీ జన్మించింది. ఈ క్రమంలో ఐదేళ్ల క్రితం శిరీష తన తోడబుట్టిన అన్న పూనెం కుమారస్వామితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. 

ఈ విషయం బయటికి తెలియడంతో శిరీష, కుమారస్వామి ఇద్దరూ 8 నెలల వయస్సున్న అనుశ్రీని తీసుకుని గ్రామం నుంచి పారిపోయారు. ఆలేరు, భువనగిరి ప్రాంతాల్లో పౌల్ట్రీ ఫార్మ్ లలో కూలీలుగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కూడా జన్మించారు. అనుశ్రీకి ఆరేళ్ల వయసు వచ్చింది. ఈ క్రమంలో బాలికకు తరచూ అనారోగ్య సమస్యలు వస్తుండడంతో శిరీష, కుమారస్వామి కలిసి అనుశ్రీని గత నెల 24న భువనగిరి జిల్లా మర్రిగూడెం సమీపంలోని పౌల్ట్రీ ఫామ్ లో చంపేశారు. 

పెళ్లైన రెండునెలలకే అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపి, ఆత్మహత్య చేసుకున్న భర్త..

ఆ తర్వాత అనుశ్రీ స్పృహ కోల్పోయింది అని చెబుతూ స్థానిక ఆర్ఎంపీ వద్దకు చికిత్స కోసం తీసుకువెళ్లారు. ఆయన చిన్నారిని పరీక్షించి పాప చనిపోయిందని చెప్పారు. అదే రోజు రాత్రి వారిద్దరూ పాప మృతదేహంతో నర్సింహులగూడెంకు చేరుకున్నారు. అయితే  పాప మృతి పట్ల  శిరీష మేనమామకు అనుమానం వచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి పాప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. పోస్టుమార్టంలో అనుశ్రీ హత్యకు గురైనట్లు నిర్థారణ అయ్యింది. దీంతో పోలీసులు  శిరీష, కుమారస్వామిలను అదుపులోకి తీసుకుని విచారించారు.  దీంతో వీరిద్దరు నేరాన్ని అంగీకరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios