భార్యభర్తల మద్య గొడవ రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్న విషాద సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. 

శ్రీకాకుళం: భార్యభర్తల మద్య గొడవ రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్న విషాద సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. భార్యను అతి కిరాతకంగా నరికి చంపిన భర్త తాను కూడా అంతే దారుణంగా హత్యహత్యకు పాల్పడ్డాడు. ఇలా క్షణికావేశంలో ఇద్దరి ప్రాణాలు బలయ్యాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం వేల్పురాయి గ్రామానికి చెందిన బాలి వెంకటరావు-అక్కమ్మలు భార్యభర్తలు. అయితే గతకొంత కాలంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతుండేవి. కానీ శనివారం ఈ గొడవ కాస్తా పెద్దదై ఆవేశంలో భార్యను గడ్డపారతో తలపై పొడిచి అతి దారుణంగా హత్యచేశాడు భర్త వెంకటరావు. 

read more ‘కోరిక తీర్చకుంటే మిమ్మల్ని అంతం చేస్తా’

ఆ తర్వాత అతడు కూడా అంతే దారుణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీమవరం జాతీయ రహదారిపై బైక్ పై మితిమీరిన వేగంతో వెళుతూ ఎదురుగా వచ్చిన ఓ లారీని ఢీకొట్టాడు. దీంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. 

కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.