తొలి మంత్రివర్గ సమావేశం
తాత్కాలిక సచివాలయం సముదాయాలు నిర్మాణమైన తర్వాత ఇంత కాలానికి మంత్రివర్గ సమావేశమం అవుతోంది.
వెలగపూడి నూతన సచివాలయంలో తొలి మంత్రివర్గ సమావేశం జరుగబోతోంది. డిసెంబర్ 1వ తేదీన జరిగే మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గం సమావేశమవుతోంది. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం సముదాయాలు నిర్మాణమైన తర్వాత ఇంత కాలానికి మంత్రివర్గ సమావేశమం అవుతోంది.
పెద్ద నోట్ల రద్దు, తదనంతర పరిణామాలు, ప్రజల మనోభావాలు, బ్యాంకర్ల పాత్రతో పాటు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించటం తదితరాలపైనే మంత్రివర్గంలో ప్రధాన చర్చ జరుగుతుంది. అదేవిధంగా పోలవరం తదితర ప్రాజెక్టుల విషయంపైన కూడా చర్చ జరుగుతుంది.