గవర్నర్ కు ఫిర్యాదు చేసిన ఐవైఆర్
తనపై సోషల్ మీడియాలో వస్తున్న అభ్యంతర పోస్టింగులపై ఫిర్యాదు చేసారు.
రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ను ఈరోజు కలిసారు. తనపై సోషల్ మీడియాలో వస్తున్న అభ్యంతర పోస్టింగులపై ఫిర్యాదు చేసారు. కార్పొరేషన్ ఛైర్మన్ గా తనను ప్రభుత్వం తొలగించిన తర్వాత అభ్యంతరకరంగా పోస్టింగులు వస్తున్నట్లు గవర్నర్ కు ఫిర్యాదు చేయటం గమనార్హం. ఫెస్ బుక్ లో తాను చేసిన పోస్టింగులు, చేసిన షేర్ల తర్వాత ప్రభుత్వ స్పందన తదితరాలను ఐవైఆర్ గవర్నర్ కు వివరించారు.