అర్ధరాత్రి హై డ్రామా...దాసరి, హరికృష్ణ విగ్రహాల తొలగింపు
విశాఖటప్నం బీచ్ రోడ్డులో అర్థరాత్రి హైడ్రామా నడిచింది. బీచ్ రోడ్డులో అనుమతి లేకుండా ఏర్పాటైన విగ్రహాలను అధికారులు తొలగించారు.
విశాఖటప్నం బీచ్ రోడ్డులో అర్థరాత్రి హైడ్రామా నడిచింది. బీచ్ రోడ్డులో అనుమతి లేకుండా ఏర్పాటైన విగ్రహాలను అధికారులు తొలగించారు. సోమవారం అర్థరాత్రి హరికృష్ణ, ఏఎన్ఆర్, దాసరి నారాయణరావు విగ్రహాలు తొలగింపునకు పాల్పడటంతో ఉద్రిక్తత తలెత్తింది.
జీవీఎంసీ జోన్ 2 ఏసీపీ నాయుడు ఆధ్వర్యంలో విగ్రహాలను తొలగించారు. బీచ్ రోడ్డులో విగ్రహాల ఏర్పాటుపై నిషేధం ఉంది. గతంలో ఈ విగ్రహాలను యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఏర్పాటు చేయగా.. వాటిని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. బీచ్రోడ్డులో విగ్రహాల ఏర్పాటుపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి.