మావోయిస్టుల వారోత్సవాలకు అగ్ర నాయకులు వచ్చినట్లు చెబుతున్నారు. ఆ సమయంలోనే మావోయిస్టులు సర్వేశ్వర రావు హత్యకు పక్కా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

విశాఖపట్నం: శాసనసభ్యుడు సర్వేశ్వర రావు హత్యకు మావోయిస్టు నేత చలపతి స్కెచ్ వేసినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. మావోయిస్టుల వారోత్సవాలకు అగ్ర నాయకులు వచ్చినట్లు చెబుతున్నారు. ఆ సమయంలోనే మావోయిస్టులు సర్వేశ్వర రావు హత్యకు పక్కా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

తమకు తెలియకుండా గ్రామాలకు వెళ్లవద్దని పోలీసులు సూచనలు ఇచ్చినప్పటికీ వాటిని బేఖతారు చేస్తూ సర్వేశ్వర రావు వెళ్లినట్లు చెబుతున్నారు. శనివారంనాడే ప్రజాప్రతినిధులకు పోలీసులు ఆ సూచనలు చేశారు. 

తాజా ఘటనతో ఏవోబీలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మధ్యాహ్నం 12 గంటలకు మావోయిస్టులు సర్వేశ్వర రావును, ఆయన అనుచరుడు సోమను హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. 

హత్యకు కారణాలను, మావోయిస్టుల హెచ్చరికలపై డిజీపి నివేదికను కోరారు. ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకుని, గన్ మెన్ ను దూరంగా పంపించివేసి మావోయిస్టులు ఇద్దరు నేతలను చంపినట్లు డిఐజి శ్రీకాంత్ చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

గన్ మెన్ ను చెట్టుకు కట్టేసి ఎమ్మెల్యేను చంపిన మావోలు

ఆ క్వారే కొంపముంచిందా: సర్వేశ్వరరావుపై దాడి వెనుక..

ఎమ్మెల్యే హత్య: అమెరికాలోని బాబుకు సమాచారం

ఎమ్మెల్యే హత్య: దాడిలో 60 మంది మావోలు.. 40 మంది మహిళలే

గన్‌మెన్ల ఆయుధాలు లాక్కొని కాల్పులు: ఎస్పీ

నాన్నను ఎందుకు చంపారో తెలియదు: కుమారుడు నాని

మావోల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి (వీడియో)

ఆ క్వారే కొంపముంచిందా: సర్వేశ్వరరావుపై దాడి వెనుక..

ఎమ్మెల్యే హత్య: అమెరికాలోని బాబుకు సమాచారం