Asianet News TeluguAsianet News Telugu

లేనివి ఉన్నట్లుగా చూపించి ప్రజాధనాన్ని దోచుకున్నారు: రాజ్యసభలో టీడీపీపై జీవీఎల్ ఫైర్

తెలుగుదేశం పార్టీ భారీగా ప్రజాధనాన్ని దోచుకుందని విరుచుకుపడ్డారు. లేని ఇళ్లను ఉన్నట్లుగా చూపి నష్టపరిహారం దండుకున్నారంటూ విరుచుకుపడ్డారు. చెట్లు, ట్యూబువెల్స్‌ పేరుతో ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలో భారీగా డబ్బు దోచుకున్నారని రాజ్యసభలో స్పష్టం చేశారు. 

bjp mp gvl narasimharao fires on tdp over polavaram R&R package
Author
New Delhi, First Published Jul 15, 2019, 5:21 PM IST

 

న్యూఢిల్లీ : ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టులో పెద్దఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు.  పోలవరం ప్రాజెక్టు విషయంలో సహాయ పునరావాస ప్యాకేజీలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందవని ఆరోపించారు. 

తెలుగుదేశం పార్టీ భారీగా ప్రజాధనాన్ని దోచుకుందని విరుచుకుపడ్డారు. లేని ఇళ్లను ఉన్నట్లుగా చూపి నష్టపరిహారం దండుకున్నారంటూ విరుచుకుపడ్డారు. చెట్లు, ట్యూబువెల్స్‌ పేరుతో ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలో భారీగా డబ్బు దోచుకున్నారని రాజ్యసభలో స్పష్టం చేశారు. 

పోలవరం ప్రాజెక్టును ఆసరాగా చేసుకుని టీడీపీ చేసిన అక్రమాలపై విచారణ జరపాలని ప్రధాని నరేంద్రమోదీని కోరతానని స్పష్టం చేశారు. త్వరలో ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని మోదీని కలిసి కోరనున్నట్లు ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios