Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. తాగొద్ద‌ని చెప్పిన పురోహితుడిని, క‌త్తుల‌తో పొడిచి..ఆపై

చెడు స్నేహాలు చేయవద్దని, మద్యం తాగొద్దని మందలించినందుకు స్నేహితుడిని, మరో స్నేహితుడు, ఇద్దరితో కలిసి హత్య చేశారు. ఈ వివరాలను పోలీసులు వెల్లడించారు. 

Atrocious .. the priest who said he was drunk, stabbed him with knives .. and then
Author
Rajamahendravaram, First Published Dec 7, 2021, 7:23 PM IST

ఏపీలోని రాజ‌మ‌హేంద్రవ‌రంలో దారుణం జ‌రిగింది. తాగొద్ద‌ని మందలించినందుకు ఓ పురోహితుడిని క‌త్తుల‌తో పొడిచి హ‌త్య చేశారు. ఈ ఘ‌ట‌న రాజ‌మ‌హేంద్రవ‌రంలో క‌ల‌కలం సృష్టించింది. ఈ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన వారిని పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ ఏటీవీ ర‌వికుమార్ మీడియాకు వివ‌రాలు వెల్ల‌డించారు. కంచిభట్ల నాగసాయి (25), వెలివెంటి సాయిపవన్ స్నేహితులు. కొంత‌మూరులో ఓ కాల‌నీలో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. వారు నాలుగు నెల‌లుగా క‌లిసి ఒకే గ‌దిలో ఉంటూ పౌరోహిత్యం చేస్తూ ఉండేవారు. ఇందులో సాయిప‌వ‌న్ అదే కాల‌నీకి చెందిన నెరుగొంద‌ల నాగేంద్ర‌, ఇంకో మైన‌ర్ అబ్బాయితో క‌లిసి స్నేహంగా ఉండేవాడు. వారితో త‌ర‌చూ తిరుగుతూ ఉండేవాడు. మ‌ద్యం సేవించేవాడు. ఈ విష‌యం న‌చ్చని కంచిభట్ల నాగసాయి.. సాయిప‌వ‌న్ ను మంద‌లించేవాడు. వారితో  తిర‌గ‌వ‌ద్ద‌ని, మందు తాగ‌వ‌ద్ద‌ని చెప్పేవాడు.

https://telugu.asianetnews.com/telangana/dead-body-found-in-water-tank-in-hyderabad-r3qu7k

ఈ విష‌యం న‌చ్చ‌ని సాయిప‌వ‌న్ వారి ఇద్ద‌రితో క‌లిసి వారి రూమ్‌లోనే నవంబ‌ర్ 24వ తేదీన రాత్రి క‌త్తులో పొడిచారు. అనంత‌రం ఇనుప‌రాడ్‌లో కొట్టి చంపేశారు. ఎక్క‌డ ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డుతోందోన‌ని వారు పెట్రోల్ తో రూమ్‌లోనే కాల్చివేశారు. అత‌డి మృత‌దేహాం పూర్తిగా కాలిపోక‌పోవ‌డంతో మ‌ళ్లీ డిసెంబ‌ర్ 3వ తేదీన పెట్రోల్ తో కాల్చారు. ఈ కాలే వాసన చుట్టు ప‌క్క‌ల‌కు వ్యాపించింది. దీంతో వారు ఆ రూమ్ వ‌ద్ద‌కు వ‌చ్చేస‌రికి తాళం వేసి పారిపోయారు. స్థానికులు అందించిన స‌మాచారంతో పోలీసులు అక్క‌డికి చేరుకున్నారు. మృత‌దేహానికి అక్క‌డే పోస్ట్‌మార్టం నిర్వ‌హించారు. ఘ‌ట‌న‌కు కారుకులైన వారి కోసం పోలీసులు గాలింపు చేప‌ట్టారు. సాకేంతిక ప‌రిజ్ఞానంను ఉప‌యోగించి వారిని 36 గంట‌ల్లోనే పోలీసులు ప‌ట్టుకున్నారు. మైన‌ర్ బాలుడితో పాటు మిగిలిన ఇద్ద‌రిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios