రేవంత్ ఇంట్లో ఐటీ దాడులపై చంద్రబాబు స్పందన ఇది
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ దాడులపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పరోక్షంగా స్పందించారు. కేంద్రప్రభుత్వం పెద్ద దొంగలను పట్టుకోదని...అధికారాన్నిరాజకీయాలకు ఉపయోగిస్తోందని మండిపడ్డారు.
అమరావతి: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ దాడులపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పరోక్షంగా స్పందించారు. కేంద్రప్రభుత్వం పెద్ద దొంగలను పట్టుకోదని...అధికారాన్నిరాజకీయాలకు ఉపయోగిస్తోందని మండిపడ్డారు. తమిళనాడులో ఏం జరిగిందో ఇతర రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. ఎన్నికలున్న ప్రతీచోటా కేంద్రం ఇలానే రాజకీయం చేస్తుందని ఆరోపించారు.
గత రెండు రోజులుగా రేవంత్ రెడ్డిని ఐటి, ఈడి అధికారులు ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి లావాదేవీలపై వారు ఆరా తీస్తున్నారు. రేవంత్ రెడ్డి కొడంగల్ లో ప్రచారంలో ఉన్న సమయంలో ఐటి అధికారులు హైదరాబాదులోని ఆయన ఇంటిలో సోదాలు నిర్వహించారు. కొడంగల్ నుంచి తిరిగి వచ్చిన రేవంత్ రెడ్డిని గురువారం సాయంత్రం నుంచి ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఆయన భార్య గీతను బ్యాంకుకు తీసుకుని వెళ్లి లాకర్లు కూాడా తెరిచారు.
సంబంధిత వార్తలు
కొనసాగుతున్న రేవంత్ విచారణ: ఆ కంప్యూటర్లో ఏముంది?
రేవంత్ భార్యతో లాకర్లు తెరిపించిన అధికారులు
రేవంత్ భార్యను బ్యాంకుకు తీసుకెళ్లి ఆరా తీస్తున్న ఐటీ అధికారులు
24 గంటలుగా సోదాలు.. రాత్రంతా రేవంత్పై ప్రశ్నల వర్షం
రేవంత్ రెడ్డి లావాదేవీల చిట్టా ఇదే: గుట్టు విప్పిన న్యాయవాది
రేవంత్రెడ్డి చుట్టూ ఉచ్చు: వేయికోట్ల దాకా అక్రమార్జన?
అప్పుడు నా కూతురి లగ్న పత్రిక రోజే...ఇప్పుడు మళ్లీ : రేవంత్ ఆవేదన
జైలు నుంచే నామినేషన్ వేస్తా.. రేవంత్ రెడ్డి
కొడంగల్ కార్యకర్తల వద్ద భావోద్వేగానికి గురైన రేవంత్
తాళాలు పగలకొట్టి మరీ రేవంత్ ఇంట్లోకి అధికారులు
రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటి దాడులు: వేలు కేసిఆర్ వైపే...