ఈ నెల 25 నుంచి కోటి మందికి టీకా పంపిణీ చేస్తామని ట్వట్టర్ వేదికగా ప్రకటించారు విజయసాయి రెడ్డి. ఇప్పటికే జగన్ ఈ మేరకు ఆదేశాలు కూడా ఇచ్చేసినట్లుగా తెలుస్తోంది
కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ లో విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి నుంచి ఉపశమనం ఎప్పుడు లభిస్తుందా అని అందరూ ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. కాగా.. వారందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. వ్యాక్సిన్ అందించే రోజుని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ నెల 25 నుంచి కోటి మందికి టీకా పంపిణీ చేస్తామని ట్వట్టర్ వేదికగా ప్రకటించారు విజయసాయి రెడ్డి. ఇప్పటికే జగన్ ఈ మేరకు ఆదేశాలు కూడా ఇచ్చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన ఆదేశాల ప్రకారమే 4వేల 762 కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణికి ఏర్పాట్లు పూర్తవుతున్నట్లు సమాచారం.
అయితే.. ఏ వ్యాక్సిన్ ఇస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఫైజర్, భారత్బయోటెక్ వ్యాక్సిన్లకు ఎమర్జెన్సీ యూసేజ్కి కేంద్రం ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. మరి ఏ వ్యాక్సిన్ ఇవ్వనున్నారన్నది తెలియాల్సి ఉంది.
ఒకవేళ ఫైజర్కు అనుమతిస్తే టీకా ఖరీదు 2వేల 5వందల రూపాయల వరకూ ఉంటుందంటున్నారు. అదే సీరమ్ ప్రపోజ్ చేస్తున్న రేటయితే 250 రూపాయలు ఉండొచ్చంటున్నారు. మరి కేంద్రం ఓకే చెప్పేది ఏ వ్యాక్సిన్కి. ఏపీ ఏ వ్యాక్సిన్ రాబోతోంది. వచ్చినా ఫ్రీగా ఇస్తారా లేక.. ఏమైనా చార్జ్ చేస్తారా.. తెలియాల్సి ఉంది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 16, 2020, 12:56 PM IST