ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 295 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కరోనా  బారిన పడి ఏడుగుగురు మృత్యువాతపడ్డారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 14,350 కి చేరింది.  

అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది.గత 24 గంటల్లో27,641 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 295 మందికి కరోనా నిర్ధారణ అయింది. Andhra pradeshలో కరోనా కేసులు 20,63,872కి చేరుకొన్నాయి.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి ఏడుగుగురు మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,350 కి చేరింది. 

also read:24 గంటల్లో 135 మందికి పాజిటివ్.. తెలంగాణలో 6,70,274కి చేరిన మొత్తం కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో 560 మంది Corona నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి 20లక్షల 44వేల 692 మంది కోలుకొన్నారు. ఏపీలో ప్రస్తుతం 4830యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,92,91,896 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 

గత 24 గంటల్లో అనంతపురంలో000,చిత్తూరులో 040, తూర్పుగోదావరిలో069,గుంటూరులో031,కడపలో 013, కృష్ణాలో068, కర్నూల్ లో001, నెల్లూరులో016, ప్రకాశంలో 019,విశాఖపట్టణంలో 022,శ్రీకాకుళంలో013, విజయనగరంలో 000,పశ్చిమగోదావరిలో 003కేసులు నమోదయ్యాయి.


గత 24 గంటల్లో కరోనాతో ఏడుగురు మృతి చెందారు. కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరి చొప్పున కరోనాతో మరణించారు. చిత్తూరు, విశాఖపట్టణం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున చనిపోయారు..దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,350కి చేరుకొంది.


ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,57,805, మరణాలు 1093
చిత్తూరు-2,46,459, మరణాలు1942
తూర్పుగోదావరి-2,93,301, మరణాలు 1290
గుంటూరు -1,77,827,మరణాలు 1233
కడప -1,15,554, మరణాలు 644
కృష్ణా -1,18,994,మరణాలు 1423
కర్నూల్ - 1,24118,మరణాలు 853
నెల్లూరు -1,46,249,మరణాలు 1051
ప్రకాశం -1,38,398, మరణాలు 1123
శ్రీకాకుళం-1,22,990, మరణాలు 786
విశాఖపట్టణం -1,57,522, మరణాలు 1127
విజయనగరం -82,914, మరణాలు 671
పశ్చిమగోదావరి-1,78,846, మరణాలు 1114

Scroll to load tweet…