Asianet News TeluguAsianet News Telugu

మామిళ్లపల్లె క్వారీ పేలుడు: ఐదు శాఖలతో కమిటీ, ఐదు రోజుల్లో నివేదికకు ప్రభుత్వం ఆదేశం

కడప జిల్లా మామిళ్లపల్లె క్వారీలో  పేలుడు ఘటనపై  ఐదు ప్రభుత్వ శాఖలతో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఐదు రోజుల్లో విచారణ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 

Andhra pradesh government appoints committee for probe on mamillapalle blast lns
Author
Kadapa, First Published May 9, 2021, 2:35 PM IST

కడప: కడప జిల్లా మామిళ్లపల్లె క్వారీలో  పేలుడు ఘటనపై  ఐదు ప్రభుత్వ శాఖలతో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఐదు రోజుల్లో విచారణ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కడప జిల్లా మామిళ్లపల్లెలోని క్వారీలో పేలుడు ఘటనలో తొమ్మిది మంది మరణించారు. ఈ విషయమై ప్రభుత్వం సీరియస్ గా తీసుకొంది. ఈ ఘటనకు కారణాలను లోతుగా దర్యాప్తు చేసేందుకు గాను  ఐదు ప్రభుత్వ శాఖలతో కమిటీని ఏర్పాటు చేసినట్టుగా రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారంనాడు ప్రకటించారు. 

also read:క్వారీ ప్రమాదం: పవన్ దిగ్బ్రాంతి.. బాధితులకు ప్రభుత్వోద్యోగం, నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్

క్వారీని లీజుకు తీసుకొన్న నిర్వాహకుడి నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని ప్రాథమిక విచారణలో అధికారులు గుర్తించారు. క్వారీని నిర్వహిస్తున్న యజమానిపై చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. సీఎం స్వంత జిల్లాలో భారీ ప్రమాదం జరగడంపై  రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకొంది. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని అధికారులు ప్రకటించారు. ఈ ఘటనకు గల కారణాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios