Asianet News TeluguAsianet News Telugu

మీసం తిప్పితే హీరోవా, చూసుకొందాం,రా...:సీఐపై జేసీ

కొజ్జా పదం తప్పా? అని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మీడియానే ప్రశ్నించారు. ఏపీ పోలీసు అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలపై  జేసీ దివాకర్ రెడ్డి  స్పందించారు. .

Anantapuram MP Jc Diwakar reddy reacts on  Madhav comments
Author
Anantapur, First Published Sep 21, 2018, 2:05 PM IST

అనంతపురం: కొజ్జా పదం తప్పా? అని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మీడియానే ప్రశ్నించారు. ఏపీ పోలీసు అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలపై  జేసీ దివాకర్ రెడ్డి  స్పందించారు.  కొజ్జా అనే పదం తప్పని మీడియా చెబితే క్షమాపణ చెప్పడానికైనా... పోలీసుల కాళ్లు పట్టుకొని పాదాభివందనం చేసేందుకు సిద్ధమని అన్నారు.
 
తాడిపత్రి ప్రబోధానంద ఆశ్రమ వివాద సమయంలో.. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ పోలీసు అధికారుల సంఘం నేతలు మండిపడ్డారు. రాజకీయ నేతలైనా, ఎవరైనా పోలీస్ వ్యవస్థని కించపరిచి మాట్లాడితే నాలుక కోస్తామంటూ సంఘం ప్రధాన కార్యదర్శి గోరంట్ల మాధవ్ హెచ్చరించారు. జేపీ వ్యాఖ్యలు పోలీసుల్ని కించపరిచేలా ఉన్నాయన్నారు. ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

మాధవ్ తన చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేశారో.... నాకు తెలియదు... సాయికుమార్ సినిమాలో కూడ మీసాలు తిప్పుతారని చెప్పారు. మాధవ్ నన్ను బెదిరించే పెద్ద మనిషా... సాయి కుమార్ అనుకొంటున్నావా.... ఇది సినిమా అనుకొంటున్నావా అంటూ మాధవ్ పై దుమ్మెత్తిపోశారు. ఈ జెంటిల్మెన్ పై  కేసు దాఖలు చేస్తామని ఆయన చెప్పారు 

నీవు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తా... నీ పోలీస్ స్టేషన్ కు రావాలా.... నీవు పుట్టిన గ్రామానికి రావాలా.. అని మాధవ్ సవాల్ విసిరారు. నీవు ఖాకీ బట్టలు విడిచి రా.. నేను కూడ సాధారణ బట్టలు వదిలివస్తానని జేసీ దివాకర్ రెడ్డి సవాల్ విసిరారు.

నీది నిజమైన మీసమైతే చెప్పాలని మాధవ్ పై  జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా నాలుక కోసేస్తే... నా చిన్న నాలుకను కూడ  తెగ కోసేయించుకొంటానని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. ఈ నెల 25వ తేదీ వరకు ఇక్కడే ఉంటా..... కత్తి పదునుగా లేకపోతే... పదును పెట్టుకోవాలని జేసీ మాధవ్ కు సూచించారు.

ప్రబోధానంద స్వామి తీరును  అందరూ ఖండిస్తున్నారని ఆయన చెప్పారు.  రాజకీయంగా ప్రబోధానందస్వామి ఘటనను కూడ కొందరు  వాడుకోవాలని చూస్తున్నారని జేసీ ఆరోపించారు. తాను కూడ  కొన్ని ఆధారాలను  ప్రబోధానందస్వామికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి ఇచ్చినట్టు చెప్పారు. 

ప్రబోధానంద స్వామి మూడు పెళ్లిళ్లు చేసుకొన్నాడని  జేసీ దివాకర్ రెడ్డి  ఆరోపించారు. భగవద్గీతను ఎవరూ  విమర్శలు చేయలేదన్నారు. తాను సాక్షాత్తూ రావణుడని.. తన భార్య మండోదరిగా ప్రచారం చేసుకొంటున్నాడని జేసీ చెప్పారు.

ప్రబోధానందస్వామి  భగవద్గీతను కించపర్చలేదా  అని ప్రశ్నించారు. ప్రబోధానందస్వామిని  మూడు గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఆయన చెప్పారు. ఆశ్రమంలో ఆయుధాలు, పుస్తకాలు, దొంగ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు,. ఓటరుకార్డులు దొరికాయని చెప్పారు. డేరా బాబా‌కు  ప్రబోధానందస్వామికి తేడా లేదన్నారు. తనతో బెడ్ పంచుకొంటే మహిళలు గోపికలు అవుతారని ప్రబోధానందస్వామి  చెబుతారని చెప్పారు

 

సంబంధిత వార్తలు

టంగ్ స్లిప్ అయితే నాలుక కోస్తాం: జేసీకి సీఐ వార్నింగ్

ప్రబోధానందస్వామి ఆశ్రమం చుట్టూ కంచె....టెన్షన్ టెన్షన్

సిఐ వార్నింగ్: జేసి ఏమన్నాడో చూడండి (వీడియో)

ప్రబోధానందస్వామి వీడియోలను బాబుకు ఇచ్చిన జేసీ

చల్లబడిన జేసీ దివాకర్ రెడ్డి: అధికారులు ఏం చేశారంటే?

జేసీ దివాకర్ రెడ్డికి బాబు ఫోన్: న్యాయ విచారణ చేయిస్తామని హామీ

ఆశ్రమంపై చర్యలు తీసుకోండి.. రాత్రంతా పోలీస్ స్టేషన్ ముందే కూర్చొన్న జేసీ

చిన్నపొడమలలో కొనసాగుతున్న ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్ ముందు జేసీ ధర్నా

గణేష్ నిమజ్జనంతో చిన్నపొడమలలో ఉద్రిక్తత: జేసీ దివాకర్ రెడ్డి నిరసన

 

Follow Us:
Download App:
  • android
  • ios