మోకాళ్ల మీద నిలబడి మహిళల నిరసన (వీడియో)
అమరావతి రాజధాని ప్రాంతంలోని తూళ్లూర దీక్షా శిబిరం వద్ద మహిళలు మోకాళ్ల మీద నిలబడి నిరసన తెలిపారు. సీఆర్డీఎ కార్యాలయాలనికి వెళ్లినవారిని అరెస్టు చేయడంపై నిరసనగా వారు ఆ పనిచేశారు.
అమరావతి: తుళ్ళూరు రైతుల దీక్షా శిబిరం ముందు మోకాళ్ళ మీద నిలబడి మహిళలు నిరసన తెలిపారు. వార్షిక కౌలు అడగటానికి విజయవాడ సీఆర్డీఏ కార్యాలయానికి రైతులు వెళ్లిన విషయం తెలిసిందే. వారిని పోలీసులు అరెస్టు చేశారు. మహిళలను పోలీసులు అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ మహిళలు ఈ నిరసనకు దిగారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ వీడియో చూడండి.
"