రెండేళ్ల చిన్నారిపై పద్నాలుగేళ్ల బాలుడు అత్యాచారం
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో దారుణం
అభం శుభం తెలియని రెండేళ్ల చిన్నారిపై ఓ మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డారు. ఏం చేస్తున్నాడో కూడా తెలియని వయసులో ఆ బాలుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ అమానుష ఘటన శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపుకొత్తూరులో చోటుచేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఓ రెండేళ్ల బాలిక తన ఇంటి బయట ఆడుకుంటోంది. చిన్నారి ఒంటరిగా ఉండడాన్ని గమనించిన పక్కింట్లోని 14ఏళ్ల బాలుడు ఆడుకుంటున్న చిన్నారిని తమ ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఇంట్లో బాలికను వివస్త్రను చేసి అత్యాచారం చేస్తుండగా చిన్నారి తాత దీన్ని గమనించాడు.
అతడు ఈ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకకెళ్లాడు. గ్రామస్తులంతా కలిసి బాలుడి కుటుంబసభ్యులను ఈ విషయంపై నిలదీశారు. మరోసారి ఇలాంటి దారుణాలు జరగక్కుండా బాలున్ని పోలీసులకు అప్పగించాలని నిర్ణయించారు.
దీంతో పాప కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలున్ని జువైనల్ హోం కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.