video news : తాపీమేస్త్రీ భార్య అనుమానాస్పద మృతి

Oct 31, 2019, 1:06 PM IST

కృష్ణా జిల్లా  నూజివీడు కొత్తపేటకు చెందిన తాపీ మేస్త్రి సత్తిబాబు భార్య కళ్యాణి  (27) తన నివాసంలో ఉరివేసుకొని అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. గత కొంతకాలంగా బార్యభర్తలమధ్య గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెప్తున్నారు. భర్త సత్తిబాబు మద్యం అలవాటు మనుకోమని భార్య పదే పదే  చెప్తూ ఉండేదని, సత్తిబాబు దాన్ని పెడచెవిన పెట్టేవాడని తెలుస్తోంది. వీరికి ఒకబాబు,ఒకపాప ఉన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కల్యాణి తల్లిదండ్రులు  తమ బిడ్డ మృతికి ఆమె భర్తే కారణమని అంటున్నారు.