ఒకే ఇంట్లో ఒకరికి జలుబు, దగ్గు, జ్వరం లాంటివి వచ్చి తగ్గిన తర్వాత అదే ఇంట్లో ఇంకొకరికి సేమ్ సమస్య వస్తే అవే మందులు వాడేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే మెడిసన్ అనేది రోగి లక్షణాలను బట్టి మారిపోతుంది. ఇలా ఒకరికి వాడిన మందులు ఇంకొకరి వాడటం వల్ల దుష్ప్రభావాలు కలగొచ్చు.
ఏఎంఆర్ రాకుండా ఉండాలంటే యాంటీ బయాటిక్స్ ఇష్టారాజ్యంగా వాడకూడదు. ముఖ్యంగా మెడికల్ షాపుల్లో తీసుకొని ఒకటి, రెండు రోజులు వాడి మానేయకూడదు. యాంటీ బయోటిక్స్ వాడటానికి కోర్సు ఉంటుంది. అందుకే డాక్టర్స్ ని సంప్రదించి మాత్రమే యాంటీ బయోటిక్స్ కోర్సులా వాడాలి.
ఎప్పటికప్పుడు చేతులు సబ్బు, నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. దగ్గినా, తుమ్మినా చేతులు గానీ, కర్చీఫ్ గానీ అడ్డుపెట్టుకోవాలి.