video news : కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి

Oct 30, 2019, 5:21 PM IST

కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి పరుషోత్తం కోడాభాయ్ రూపాల బుధవారం విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాదికారి శ్రీ ఎం.వి.సురేష్ బాబు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం కోడాభాయ్ కి వేదపండితులు వేద ఆశీర్వచనము చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ బాబు అమ్మవారి ప్రసాదములు, చిత్రపటమును అందజేసినారు.