ఎస్బీఐ అమృత్ కలాష్ పథకంలో పెట్టుబడి పెట్టిన సాధారణ ఖాతాదారులకు 7.10 % వార్షిక వడ్డీ లభిస్తుంది. ఇదే పథకంలో పెట్టుబడి పెట్టిన సీనియర్ సిటిజన్లకు 7.60 % వార్షిక వడ్డీ లభిస్తుంది.
ఈ స్కీమ్ లో ఉన్న మరో ముఖ్యమైన బెనిఫిట్ ఏమిటంటే లోన్ సౌకర్యం. అంటే మీరు పెట్టుబడిగా పెట్టిన డిపాజిట్పై రుణం పొందే అవకాశం ఈ స్కీమ్ లో ఉంది.
మీరు గాని ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటే నేరుగా ఎస్బీఐ బ్రాంచ్లకు వెళ్లి వివరాలు తెలుసుకొని ఇన్వెస్ట్ చేయవచ్చు. లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరే స్వయంగా ఈ స్కీమ్ లో చేరవచ్చు. మరో అవకాశం ఏంటంటే.. YONO యాప్ ద్వారా కూడా మీరు ఎస్బీఐ అమృత్ కలాష్ పథకంలో ఇన్వెస్ట్ చేయవచ్చు.