Video : చదివింది నాలుగో తరగతి...చేసేది క్రికెట్ బెట్టింగులు...

Dec 4, 2019, 4:54 PM IST

విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు.నిందితుల నుంచి 16లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. నగరానికి చెందిన పైలా ప్రసాద్, మోహన్ కృష్ణ, శరత్ చంద్రతో పాటు పశ్చిమ గోదావరికి చెందిన మోహన్ కృష్ణను అదుపులోకి తీసుకున్నామని కమీషనర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. నిందితుల నుంచి బెట్టింగ్ కు నిర్వహించే 20 సెల్ ఫోన్స్ బాక్స్, వీడియో కాన్ టీవీ, 2 ల్యాప్ట్యాప్ లు,19 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ లో ప్రధాన నిందితుడు ప్రసాద్ కేవలం 4 వ తరగతే చదువుకున్నా,టెక్నాలజీ సాయంతో బెట్టింగ్ నిర్వహిస్తున్నాడని అన్నారు.