టెలికమ్యూనికేషన్స్ నియమాలను మార్చి కొత్త ‘రైట్ ఆఫ్ వే’ (RoW) నియమాలను అమలు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల జియో, ఎయిర్టెల్, వోడా, BSNLపై ప్రభావం పడనుంది. గత కొన్నాళ్లుగా ప్రభుత్వం టెలికమ్యూనికేషన్స్ నియమాలను ఎప్పటికప్పుడు మారుస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు టెలికమ్యూనికేషన్స్ చట్టంలో కొన్ని కొత్త నియమాలు చేర్చారు. ఇకపై వాటిని కూడా పాటించాలని కేంద్ర ప్రభుత్వం టెలికాం సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు కూడా ఈ నియమాలు అమలయ్యేలా చూడాలని కోరింది.