తెలంగాణ ఆర్టీసి ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్

Sep 3, 2021, 11:42 AM IST

హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమీషనర్ గా మూడేళ్లపాటు సేవలందించిన విసి సజ్జనార్ తాజాగా టీఎస్ ఆర్టీసి ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల సైబరాబాద్ కమీషనర్ గా స్టీఫెన్ రవీంద్రను నియమించిన కేసీఆర్ సర్కార్ సజ్జనార్ ను ఆర్టీసికి బదిలీ చేసింది. దీంతో ఇవాళ(శుక్రవారం) బస్ భవన్ లో ఎండీగా బాధ్యతలను స్వీకరించారు. వేదపండితుల ఆశీర్వచనాల మధ్య తెలంగాణ ఆర్టీసి ఎండీగా బాధ్యతలు స్వీకరించారు విసి సజ్జనార్.