సచిన్, కోహ్లీ, ధోనీ.. ఇండియాలోనే మోస్ట్ రిచ్ క్రికెటర్లు ఎవరో తెలుసా ?

First Published May 1, 2024, 6:00 PM IST

భారతదేశంలో క్రికెట్‌కు ఉన్న ఆదరణ మరే ఇతర క్రీడకూ లేదు. ఇండియాలో క్రికెట్ చాలా గొప్ప స్పోర్ట్. అయితే  భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే క్రికెటర్లు కూడా సెలబ్రిటీల కంటే తక్కువేం కాదు, వీరి  లైఫ్ స్టయిల్ చాలా గొప్పగా  ఉంటుంది. ఇంతకీ భారతదేశంలో అత్యంత సంపన్న క్రికెటర్ ఎవరో తెలుసా?
 

సచిన్ టెండూల్కర్:
క్రికెట్ దేవుడుగా పిలువబడే సచిన్ టెండూల్కర్ భారతదేశంలోనే అత్యంత ధనిక క్రికెటర్. అతని మొత్తం విలువ 1300 కోట్లు.
 

విరాట్ కోహ్లీ:
కింగ్ కోహ్లీగా పేరుగాంచిన భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మొత్తం సంపద రూ.980 కోట్లు. 
 

మహేంద్ర సింగ్ ధోని:
ప్రపంచ కప్ విజేత కెప్టెన్ ఎం.ఎస్ ధోని ఈ లిస్టులో 3వ స్థానంలో ఉన్నాడు. అతని మొత్తం విలువ రూ.860 కోట్లు.
 

సౌరవ్ గంగూలీ:
దాదాగా పేరొందిన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆస్తుల విలువ రూ.365 కోట్లు. సౌరవ్ గంగూలీ ఒకప్పుడు మంచి పేరు పొందిన కెప్టెన్ కూడా. 
 

వీరేంద్ర సెహ్వాగ్:
మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ 286 కోట్ల మొత్తం సంపదతో భారతదేశంలో 5వ అత్యంత సంపన్న క్రికెటర్.

yuvraj

యువరాజ్ సింగ్:
టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ రూ.255 కోట్లతో 6వ స్థానంలో ఉన్నాడు. యువరాజ్ సింగ్ అటు బ్యాటింగ్ ఇటు బోలింగ్ సహా ఫీల్డింగ్లో కూడా మంచి ప్లేయర్.

click me!