అలుగునూరు బ్రిడ్జిపై నుండి కారు బోల్తా: ఇద్దరు మృతి

Feb 16, 2020, 12:55 PM IST

కరీంనగర్ జిల్లా అలుగునూరు వద్ద కారు బ్రిడ్జిపై నుండి బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్ కారు బోల్తా పడిన ఘటనలో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ  ప్రమాదం ఘటనను పరిశీలిస్తున్న కానిస్టేబుల్ చంద్రశేఖర్ లోయలోపడి  చికిత్సపొందుతూ ఆయన కూడ మృతి చెందారు.