వనపర్తి : డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించిన మంత్రులు

Feb 18, 2020, 1:59 PM IST

వనపర్తి నియోజకవర్గంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పర్యటించారు. ఖిల్లా ఘణపురం మండలం ఈర్లతండా, కర్నెతండాలలో డబల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. 50 ఇండ్లకు గాను 37 ఇండ్లు పూర్తయ్యాయని మిగతావి కూడా త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.