నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది వలసకూలీలకు తీవ్రగాయాలు..

May 16, 2020, 11:01 AM IST

నిర్మ‌ల్ ‌ జిల్లాలోభాగ్య‌న‌గ‌ర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ ర‌హ‌దారిపై  రెయిలింగ్ ను ఢీకొట్టి లారీ అదుపు త‌ప్పింది. లారీ హైదరాబాద్ నుండి 70మంది వలసకార్మికులతో ఉత్తరప్రదేశ్ లోని ఘోర‌ఖ్ పూర్ కు వెడుతోంది. పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని హైదరాబాద్ కు తరలించారు. మరో ఏడుగురికి కాళ్లూ, చేతులు విరిగాయి. ఇంకో 20 మంది క్షతగాత్రులయ్యారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. దేవుడి దయవల్ల ఎవ్వరూ చనిపోలేదని మంత్రి తెలిపారు.