ముస్తాబాద్ లో కేటీఆర్ పర్యటన.. తండోపతండాలుగా వచ్చిన జనం..

Jun 10, 2020, 1:32 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండలంలో మంత్రి కేటీఆర్ కు ఘనస్వాగతం పలికారు. బదనకల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సి. సి టీవి కెమెరాలు, వైకుంఠధామం, రైతు వేదిక భవన నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. రజక, అంబేద్కర్ సంఘ భవనాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు ఈ సందర్భంగా స్థానికులు పెద్ద ఎత్తున డప్పులు, వాయిద్యాలతో మంత్రికి స్వాగతం పలికారు.